1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (07:44 IST)

రాజకీయాల్లోకి ఆనందయ్య... బీసీ కోసం రాజకీయ పార్టీ

నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం మండలానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య సంచలన ప్రకటన చేశారు. బీసీల కోసం కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయన్నారు. అదేసమయంలో బీసీలపై రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం  ఏమాత్రం సరికాదన్నారు. 
 
ఇకపోతే, కరోనా కష్టకాలంలో అనేక మంది రోగుల ప్రాణాలు కాపాడిన ఆనందయ్య.. ఇపుడు థర్డ్ వేవ్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మూడో దశ ఉత్పన్నమైనప్పటికీ దానికి సరైన మందు తన వద్ద ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్ర ఆ మందును ప్రజలందరికీ పంపిణీ చేస్తానని తెలిపారు.