1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరం : వైద్యులు వెల్లడి

YS Avinash Reddy
అనారోగ్యంపాలైన కడప వైకాపా ఎంపి అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ హితేష్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం చేసిన పరీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందని.. అది గుండెపోటు వచ్చే అవకాశాన్ని సూచిస్తోందన్నారు. 
 
అందువల్ల యాంజియోగ్రామ్ నిర్వహించగా ఆమెకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. రక్తపోటు తక్కువగా ఉందని, అది సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు ఎలాంటి వైద్యం అందించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, మరికొన్ని రోజులపాటు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అవినాష్ తల్లి లక్ష్మమ్మ విశ్వభారతి ఆసుపత్రిలో నాలుగో అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన అయిదో అంతస్తులో ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.