1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (22:56 IST)

చెన్నైకి నీరు.. ఏపీ ఓకే.. తెలంగాణ నాట్ ఓకే

తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి నీరు అందించేందుకు ఏపీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ తెలంగాణ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. చెన్నైకి నీరు అందించేందుకు వీలుగా శ్రీశైలం వద్ద తమిళనాడు ప్రభుత్వం నూతన ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రతిపాదించింది.
 
ప్రతి సంవత్సరం ఇదొక సమస్యాత్మక అంశం అవుతోందని, శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకం నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఏపీ తెలిపింది. కానీ తెలంగాణ స్పందిస్తూ, ఇప్పటికే శ్రీశైలం నుంచి ఏపీ భారీగా నీటిని తరలించిందని, ఆ నీటి నుంచి చెన్నైకి నీరు అందించాలని పేర్కొంది. 
 
ఏపీ అత్యధికంగా నీటిని కండలేరు జలాశయానికి తరలించిందని, అక్కడి నుంచి నీటిని ఇవ్వాలని సూచించింది. అంతేకాదు, కండలేరు నుంచి చెన్నై వరకు పైప్ లైన్ నిర్మాణం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక అందితే పరిశీలించి తమ నిర్ణయం చెప్తామని పేర్కొంది.