శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (19:25 IST)

భారత్‌బంద్‌‌కు సంపూర్ణ మద్దతు.. 27న టీడీపీ, ఆర్టీసీ కూడా..?

రైతు సంఘాలు, ప్రజాసంఘాలిచ్చిన పిలుపునకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈనెల 27న భారత్‌బంద్‌ చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ చేపడుతున్న ఉద్యమంలో అంతా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు. 
 
ఈ బంద్‌లో ఆర్టీసీ కూడా పాల్గొంటుందని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 35మంది ఆత్మబలిదానాలు వృధా కాకూడదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ వ్యక్తులకు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒతేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్​కుసంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27న తలపెట్టిన భారత్​ బంద్​కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్​​ అసోషియేషన్​ ప్రకటించింది.