శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (09:23 IST)

ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి ఇకపై వారికి నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టంచేసింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మెమో జారీచేశారు. 
 
ఈ కార్యాలయాల్లో అవినీతి పెరగడగానికి ప్రధాన కారణం అనధికార వ్యక్తులేనని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇటీవల పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది. 
 
ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని, అందుకే అనధికార వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.