శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (18:12 IST)

ఆంధ్రప్రదేశ్‌ లోకి డెల్టా ప్లస్ కేసు.. థర్డ్ వేవ్‌తో జాగ్రత్త..

కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వచ్చిందని చెప్పారు.
 
అయితే అతడి నుంచి ఎవరికీ వైరస్ వ్యాపించలేదని మంత్రి అన్నారు. బాధితుడికి సరైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ వేరియంట్ల కేసుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితులు ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ సడలింపులపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
 
కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.