1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 28 మే 2015 (19:01 IST)

దసరాకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన : చంద్రబాబు

దసరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ముహుర్త బలం కంటే సంకల్పం బలం ప్రధానమైనదన్నారు. హైదరాబాద్ గండిపేటలో జరుగుతున్న మహానాడులో రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
 
జూన్ 6న రాజధానికి భూమిపూజ చేస్తామన్నారు. ఎంతమంది అడ్డువచ్చినా అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్ప నగరాలు నిర్మించిన అనుభవం మనకుందని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.