1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (17:56 IST)

శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు : : ప్రభుత్వ విప్

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారును ఓ బడుద్ధాయిగా ప్రభుత్వ విప్ అభివర్ణించారు. టీడీపీ నేతలు శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో అధికార, వైకాపా నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోయేలా వుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో బండారు సత్యనారాయణనను ఉద్దేశించి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ టీడీపీలో బండారు వంటి లుచ్ఛా నాయకులే ఉన్నారు. 
 
అకాల మరణం చెందిన వివాద రహితుడైన మంత్రి గౌతం రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బండారూ.. నిన్ను ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా? అంటూ నిలదీశారు. 
 
ఇకపోతే యనమల రామకృష్ణుడుకి తునిలో సత్తా లేకే పక్క జిల్లాలోని పత్తా లేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. యనమల ఒక ముసలోడు, ఆ ముసలోడు యువత కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
సీఎం పెట్టుబడుల గురించి ఒత్తిడి తేవడం వల్లే మంత్రి గౌతం రెడ్డికి గుండెపోటుకు గురయ్యారని, దీనిపై విచారణ జరిపించాలంటూ టీడీపీ నేతల డిమాండ్ చేయడంతో వైకాపా నేతలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.