శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (17:04 IST)

ధర్మగిరి వేద పాఠాశాల కరోనా రోగులకు మెరుగైన చికిత్స : మంత్రి ఆళ్లనాని

తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు స్విమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
 
తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను, అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్ రుయాలో వెయ్యి పడకలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు హోం క్వారంటైన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించాలని, ప్రతిరోజూ వైద్యులు పర్యవేక్షించాలని అన్నారు. 
 
డిఎంహెచ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్విమ్స్, రుయాలో 120 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది హోం క్వారంటైన్లో ఉన్నారన్నారు. ప్రతిరోజూ రెండు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.