ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:57 IST)

ఇంత‌కీ హైకోర్టు త‌ర‌లుతోందా? కొత్త భ‌వ‌నం ఎందుకు?

ఏపీలో మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ ఎపుడు అమ‌లు అవుతుంద‌నేది అంద‌రికీ మిస్ట‌రీగా మారుతోంది. ఒక ప‌క్క ప‌రిపాల‌నా రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు త‌ర‌లడం లేదు. మ‌రో ప‌క్క న్యాయ రాజ‌ధాని క‌ర్నూలుకు ఇంకా త‌ర‌ల‌నే లేదు. పైగా, ఇపుడున్న అమ‌రావ‌తి హైకోర్టులో అద‌న‌పు భ‌వ‌నాల నిర్మాణానికి టెండ‌ర్లు పిలిచారు.

హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీయే టెండర్లు పిలిచింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు.

ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ కం రివర్స్‌ ఆక్షన్‌ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలి. కాగా, రాజధాని గ్రామాల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఏఎంఆర్డీయే చేపట్టింది. సుమారు రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించింది.