శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:37 IST)

త్యాగానికి ప్రతీక బక్రీద్.. వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

వైకాపా ప్రభుత్వం మైనార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కోసం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 
 
పశ్చిమ నియోజవర్గం గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత పవిత్రంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే పండుగని, మైనారిటీల సామూహిక ప్రార్థన నిర్వహించుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు హక్కుగా ఇవ్వబడింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అప్పాజీ, వైకాపా నాయకులు చాంద్ బాయ్, నాహిద్, అబ్దుల్లా తదితరులు ఉన్నారు.