1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (16:28 IST)

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రలో తేనెటీగలు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రలో  తేనెటీగల కలకలం రేగింది. బుధవారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల టీమ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతుంది. 
 
షర్మిల మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే షర్మిల టీమ్ అప్రమత్తమైంది.
 
దీంతో వారు షర్మిలను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో షర్మిల తేనెటీగల దాడి నుండి బయటపడ్డారు. అయితే తేనెటీగల దాడిలో పలువురు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.