1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (17:22 IST)

రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై వేలాడిన లారీ

రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరి నదిపై వున్న రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న లారీ , ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయి పుట్ పాత్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అంతేగాకుండా నుజ్జునుజ్జు కావడంతో లారీ బ్రిడ్జిపై నుంచి వేలాడుతోంది. 
 
ఏ క్షమమైనా నదిలో పడిపోవడానికి సిద్దంగా ఉండటంతో, బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంబించాయి. డ్రైవర్ రాంబాబు, క్రీనర్‌లు  వ్రేలాడుతున్న లారీ నుంచి నెమ్మదిగా బ్రిడ్జిపైకి ఎక్కి  ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.  దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని లారీని పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు.