1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 29 మే 2019 (20:16 IST)

మే ఫ్లవర్ పూసింది.. చాలా అరుదైన పుష్పం.. ఎక్కడ?

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్న గార్డెన్‌లో అరుదైన 'మే ఫ్లవర్' మొక్క కనిపించింది. అందమైన పూలతో వికసించిన ఈ మే ఫ్లవర్‌ సందర్శకులకు, ఉద్యోగులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. భూమి లోపల ఉన్న గడ్డ మొక్కగా పెరిగి పూలతో వికసించింది. 
 
మే 1వ తేదీ నుంచి మొక్కగా పెరుగుతూ 15న పూలతో వికసించినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. మరో 15 రోజులపాటు అందమైన పుష్పాలతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచి 30వ తేదీ అనంతరం చెట్టు చనిపోతుందని, సంవత్సరమంతా ఆ మొక్క ఇక కనిపించదు అని తెలిపారు. 
 
భూమిలో ఉన్న వేర్లగడ్డ తిరిగి మే నెలలోనే మొక్కగా పెరిగి పూలతో వికసిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పూల మొక్కలు చాలా అరుదుగా ఉంటాయని వర్సిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు.