సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ : ఎంపీలకు వెల్లడించిన సీఎం చంద్రబాబు
- ప్రజలకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. త్వరలో కొత్త రేషన్ కార్డులు
- పిఠాపురంలో బాలికపై అత్యాచారం: డిప్యూటీ సీఎం పవన్ సీరియస్
- దసరా: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే సీటు బుకింగ్స్ 62 శాతం పెరుగుదల
- తిరుమలలో ప్రి-వెడ్డింగ్ షూట్ చేసామా? ఆపండి మీ చెత్త రాతలు: దివ్వల మాధురి (Video)
ఆంధ్రప్రదేశ్కు బుల్లెట్ రైలు.. ఎప్పుడొస్తుందో తెలుసా?
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందంజలో ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఏపీకి కొత్త బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది.
ఇందులో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్కు బుల్లెట్ రైలును ప్రతిపాదించింది. ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కూటమి మంత్రులకు ఇదే విషయాన్ని తెలియజేశారు.
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ముంబై, అహ్మదాబాద్లను కలుపుతుంది. ఈ మార్గంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది 2026లో లాంచ్ అవుతుందని అంచనా. దక్షిణ భారతదేశంలోని రెండు మార్గాలు (చెన్నై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్) సహా ఏడు వేర్వేరు మార్గాల్లో బుల్లెట్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొదట్లో ఈ రూట్లలో ఏపీ భాగం కాదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మార్గాన్ని చేర్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. చెన్నై, బెంగళూరు, అమరావతి, హైదరాబాద్లను బుల్లెట్ రైలు మార్గంలో అనుసంధానం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ మార్గంలో కొత్త రైల్వే ట్రాక్ వేయాలని అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేయాలనుకుంటోంది.
