చిత్తూరు: ప్రైవేట్ కాలేజీ మూడో అంతస్థు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య (video)
Student
కాలేజీలో మూడో అంతస్థు నుంచి దూకి ఓ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనిని బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్రగా గుర్తించారు. కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన రుద్రను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు.
ఐదు రోజుల క్రితం ఇదే కాలేజీలో మూడవ అంతస్థు నుంచి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా మరో విద్యార్థి రుద్ర ఆత్మహత్యతో ప్రాణాలు తీసుకోవడం స్టూడెంట్స్లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) November 4, 2025
చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం
బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య
హాస్పిటల్ కు తరలించే లోపు మృతి
సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి… pic.twitter.com/wrx6CufiRO
