1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జూన్ 2024 (14:51 IST)

కాకినాడలో రేషన్ మాఫియా.. సీఐడీ విచారణ జరిపించాలి.. నాదెండ్ల మనోహర్

Nadendla
Nadendla
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసి కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని ఆరోపించారు. శనివారం వరుసగా రెండో రోజు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీకి కొందరు అధికారులు కూడా సహకరించారని విమర్శించారు. రేషన్ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 
 
కాకినాడలో 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని, కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా తన పర్యటన కారణంగా అక్రమ బియ్యం రవాణా జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మంత్రి నిప్పులు చెరిగారు.
 
గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.36,300 కోట్లు అప్పులు చేసి రైతులకు చెల్లించాల్సిన రూ.1600 కోట్లు చెల్లించకుండా వదిలేసింది. వరి సేకరణ ప్రక్రియకు సంబంధించి త్వరలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం.. కౌలు రైతులకు మేలు చేస్తాం. అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ హామీ ఇచ్చారు.