1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (21:00 IST)

గ్రామ సచివాలయాల్లో వేగంగా రిజిస్ట్రేషన్లు!

గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో వేగంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియలు తలెత్తే సవాళ్ల పరిష్కారంపై ఫోకస్‌ పెడుతోంది సర్కార్‌.
 
దీనిలో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని జగన్ స్పష్టం చేశారు.