1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:49 IST)

19న విశాఖ జిల్లా పర్యటనకు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు కారులో వెళుతారు. ఆ తర్వాత ఉదయం 10.25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11.05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి 11.50 గంటలకు రుషికొండ వెమ వెల్‌నెస్ రిసార్టుకు చేరుకుంటారు. అక్కడ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ భేటీ ముగిసిన తర్వాత విశాఖలో మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి తాడేపల్లికి 2.30 గంటలకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా విశాఖలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.