బుధవారం, 13 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఆగస్టు 2025 (17:44 IST)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

dsp koya murali
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ మురళి నాయక్, వైకాపా కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంద. దీంత అక్కడ ఉద్రిక్తతతో పాటు గందరగోళం నెలకొంది. ఒకసమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన డీఎస్పీ మురళి నాయక్.. వైకాపా కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా అంటూ హెచ్చరించారు. 
 
పులివెందులలో జరుగుతున్న జట్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు డీఎస్పీ మురళీ నాయక్‌ భారీ పోలీస్ బలగంతో వైకాపా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైకాపా నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ నాయకుడికి ఏదో జరుగుతుందనే ఆందోళనతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా జనం పోగయ్యారు. 
 
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డీఎస్పీ మురళీ నాయక్ రంగంలోకి దిగారు. గుంపుగా ఉన్న కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వారు ఎంత చెప్పినా వినికుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన డీఎస్పీ మురళీ నాయక్... వైకాపా కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. కాల్చిపడేస్తా నా కొ... కా.. నువ్వు తాగి మాట్లాడొద్దు. ఏమనకుంటున్నావ్... పోలీస్ యూనిఫాం ఇక్కడ అంటూ గట్టిగా హెచ్చరించారు. డీఎస్పీ వార్నింగ్‌ తాలూకూ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.