సంబంధిత వార్తలు
- మీ పేరెంటింగ్ ప్రయాణంలో అత్యుత్తమ స్నేహితునిగా నిలువనున్న ‘పేరెంట్ ట్రైబ్’ బై సూపర్బాటమ్స్
- ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనంపై గూగుల్ కోత
- 10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్ టిక్కెట్ ఆఫర్ను ప్రకటించిన వండర్లా హాలీడేస్
- ఎన్ఎఫ్ఓ ఆఫరింగ్స్ను విడుదల చేసిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్
- ఒక గ్రాము డైమండ్ కొంటే 2 గ్రాముల బంగారం నాణెం ఫ్రీ
పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ..
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్ ఏర్పడింది. ఇందుకు కారణం బిర్యానీ. అవును. రూపాయికే దమ్ బిర్యానీ అంటే జనం ఎగబడతారుగా.. అదే జరిగింది. మార్కాపురం పట్టణంలో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆఫర్ను ప్రకటించింది.
పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ అంటూ ప్రచారం చేసింది. అంతే బిర్యానీ ప్రియులు ఆగమేఘాల మీద రెస్టారెంట్ ముందు వాలిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. దీంతో తోపులాట జరిగింది.
జనం తాకిడికి తట్టుకోలేకపోయిన రెస్టారెంట్ యాజమాన్యం మధ్యాహ్నం వరకు బిర్యానీ పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేసింది. రెస్టారెంట్ ముందు జనం తోపులాటలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తర్వాతి కథనం
