1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:27 IST)

ఏపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు

ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని భూకంపం సంభవించడంతో కోస్తా ప్రాంతాల్లో కలకలం రేగింది. 
 
మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. ఈ భూప్రకంపనల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.