1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (10:07 IST)

తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్.. ఏంటది?

babu cbn
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త ప్రకటించింది. బియ్యంతో పాటు, ఇప్పుడు వారికి నిత్యావసర వస్తువులైన పప్పు, చక్కెర కూడా అందుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు కందుల కొనుగోలుకు చర్యలు చేపట్టారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంది.
 
బియ్యం, పప్పు, చక్కెర, నూనె ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. జులై 1 నుంచి తెల్ల రేషన్‌కార్డుదారులకు ఈ వస్తువులు అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నిత్యావసర సరుకులను అధికారులు తూకం వేసి తనిఖీలు చేపట్టారు.