1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Green signal to bars in AP

ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్

Green signal
ఏపీలో లాక్‌డౌన్‌తో మూతపడిన బార్లు.. మళ్లీ తెరుచుకోనున్నాయి. అన్‌లాక్‌ 4.0లో రెస్టారెంట్లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించింది.

ఈ క్రమంలో రాష్ట్రంలో బార్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 బార్ల లైసెన్సులు కొనసాగిస్తున్నట్లు, 2021 జూన్‌ 30 వరకు వర్తిస్తుందని జీవోలలో ప్రభుత్వం స్పష్టంచేసింది.

ప్రస్తుత బార్‌ లైసెన్సీల కాలపరిమితి 2022 వరకు ఉన్నా ఈ ఏడాది జూన్‌ వరకే ఫీజులు చెల్లించారు. అప్పట్లో ఫీజులు చెల్లించాల్సి ఉన్నా కరోనా వల్ల 31 మంది మినహా ఎవరూ చెల్లించలేదు.

అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అందరి లైసెన్సులు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల నుంచి లైసెన్సు ఫీజులు చెల్లించాలని స్పష్టంచేసింది. 
About Writer
ఎం
తర్వాతి కథనం
కరోనాతో అల్లాడుతుంటే బార్లు అవసరమా? : సీపీఐ