రోడ్డు ప్రమాదం.. హోంమంత్రి అనిత కారును ఆపి ఏం చేశారంటే? (video)
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి సహాయం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగిన ఈ సంఘటనలో ఒక యువతి గాయపడింది.
అదే సమయంలో, శ్రీశైలంకు వెళుతూ అనిత అదే మార్గంలో ప్రయాణిస్తుండగా, ప్రమాదాన్ని గమనించిన ఆమె తన కాన్వాయ్ను ఆపి గాయపడిన మహిళకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. గాయపడిన మహిళకు తాగునీరు అందించింది, భరోసా ఇచ్చారు.
ఆ తర్వాత ఆ మహిళను మరొక వాహనంలో ఆసుపత్రికి తరలించి శ్రీశైలంకు తిరిగి ప్రయాణం కొనసాగించారు అనిత. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మంత్రిని ప్రశంసిస్తున్నారు.