శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (17:45 IST)

మత్తుమందు అక్రమ రవాణా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

ఇటీవలి కాలంలో హైరాబాద్ నగరంలో మత్తుమందు పదార్థాలను అక్రమంగా తరలించే వారిలో ఆఫ్రికన్ మహిళలు పట్టుబడుతున్నారు. ఇటీవల గోవా నుంచి మాదకద్రవ్యాలను తరలిస్తూ హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా హల్‌చల్ చేసింది. అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేరెడ్‌మెట్‌ వద్ద వాహన తినిఖీలు నిర్వహిస్తుండగా మాదకద్రవ్యాల ముఠా పోలీసులకు చిక్కింది. వారి నుంచి భారీగా కొకైన్‌, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోటి రూపాయల వరకూ ఉండవచ్చని అంచనా వేసారు. 
 
ఏపీ, తెలంగాణలలో గత కొంతకాలంగా ఈ ముఠా వ్యాపారాన్ని కొనసాగిస్తోందని విచారణలో వెల్లడైంది. ఇతర ప్రాంతాల నుండి కొకైన్‌, హెరాయిన్‌ను తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని తేలింది. పట్టుబడిన నలుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరికి మాదకద్రవ్యాలు ఎక్కడ నుండి వస్తున్నాయి. ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.