మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 26 అక్టోబరు 2016 (19:17 IST)

ఏపీ సీఎం చంద్ర‌బాబు, నారా లోకేష్‌కు మావోయిస్టుల బెదిరింపు లేఖ‌... ఆత్మాహుతి దాడి చేస్తాం...

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావో

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ తన లేఖలో పేర్కొన్నారు. 
 
ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. భోజనంలో విషం పెట్టి చంపారని ఆరోపించారు. చంద్రబాబు ఇంతకింత ఫలితాన్ని అనుభవిస్తారనీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బాబులపై అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. పోలీసు అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అగ్ర నాయకత్వాన్ని మట్టుబెట్టాలన్న ప్రణాళికతోనే ఈ ఎన్ కౌంటర్ చేశారనీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు.