1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మే 2024 (16:12 IST)

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ravindranath reddy
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి నోరు జారారు. అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడు చేసిందని వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా అన్ని అన్నారు. 
 
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని వేడుకున్నానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగాపడాలని కోరుకున్నానని తెలిపారు. రైతులు, కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నానని అన్నారు. వైసీపీకి 175 సీట్లు వస్తాయని చెప్పారు. 
 
జగన్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ ఉందని, జూన్ 4 మధ్యాహ్నం నుంచి ఫలితాలు తెలుస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపించకపోవచ్చని అన్నారు. వైసీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, అవినాష్‌ రెడ్డి ఎంపీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కడప ఎంపీగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, ఇంకెవరూ నిలబడ్డ గెలవలేరని చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసిందని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
 
కాగా, రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన వ్యాఖ్యలు పార్టీతో పాటు పార్టీ కార్యకర్తలను కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నాయని పార్టీ నేతలే చెబుతున్నారు.