1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 13 అక్టోబరు 2021 (11:05 IST)

జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రజత పతక విజేత వెంక‌ట్రాద్రి

విజ‌య‌వాడ‌లోఏని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధమ సంవత్సరం విద్యార్థి కె.వెంకటాద్రి ఆర్చ‌రీలో విశేష‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన 40వ యన్టీపీసీ సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు.

స్కూల్ స్థాయి నుండే ఆర్చరీ అభ్యాసం చేస్తున్న వెంకటాద్రి పలు పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచినట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ద‌మ‌వుతున్నట్లు కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకం సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచిన వెంకటాద్రిని సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్ధులు అభినందించారు.