1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (13:52 IST)

ఇప్పటం బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఇప్పటం గ్రామానికి చెందిన బాధితులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వైకాపా నేతల ప్రోద్భలంతో ఇప్పటం గ్రామంలోని జనసేన పార్టీ మద్దతుదారుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో ఆ గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాలకు చెందిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. 
 
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. విస్తరణ పేరుతో జనసేన పార్టీకి చెందిన మద్దతుదారుల గృహాలను కూల్చివేశారు. దీనిపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సహకరించారన్న కక్షతో వైకాపా నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ గృహాలను కూల్చివేశారు. ఇది రాష్ట్రంలో సంచనంగా మారిన విషయం తెల్సిందే. 
 
దీనిపై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఇప్పటం గ్రామంలో వైకాపా ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్నవారిని జనసేన పార్టీ ఆదుకుటుందని తెలిపారు. బాధితులకు తన వంతుగా అండగా నిలబడాలని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలిపారు. ఇందులోభాగంగా, బాధితులకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితులకు త్వరలోనే అందజేస్తారని తెలిపారు.