1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (21:15 IST)

ద్వారంపూడికి "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా : పవన్ కళ్యాణ్

వైకాపాకు చెందిన కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ద్వారంపూడి తన వైఖరిని మార్చుకోకుంటే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానంటూ హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని ఇచ్చంట గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 
 
"వైకాపా అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి గారికి ఓ విషయం చెప్పదలచుకున్నాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి అకారణంగా నన్ను పచ్చిబూతులు తిట్టారు. వినకూడని మాటలు అన్నాడు. అయినా నేను ఊరుకున్నాను. కానీ, మా జనసైనికులకు కోపాలు వచ్చాయి. 
 
పంతం నానాజీ వంటి నేతలకు కోపాలు వచ్చాయి. ఎందుకు ఇలా అన్నావంటూ వారు నిలదీయడానికి వెళితే వారిపై దాడులు చేశారు. నన్ను అన్న మాటలతో నాకు బాధ అనపించలేదు. కానీ, వీర మహిళలు వారు అనిపించుకున్న మాటలు నాకు చెబితే అయ్యో వీళ్లను ఎందుకు రాజకీయాల్లో దించాను అని బాధపడ్డాను. 
 
వైవీ సుబ్బారెడ్డిగారు... మీ  పెద్దవాళ్లు, విజ్ఞులు.. ఇలాంటి వారికి గడ్డిపెట్టండి. ఈ సందర్భంగా ద్వారంపూడికి చంద్రశేఖర్ కూడా చెబుతున్నాం. గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది. భవిష్యత్‌లో కూడా మీరు ఇలాగే వ్యవహరిస్తే "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ అంటే ఏమిటో చూపిస్తా" అని గట్టి వార్నింగ్ ఇచ్చారు.