శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (21:06 IST)

కోవిడ్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి: పాఠశాల విద్యా సంచాలకులు

కరోనా మహామ్మారి భారి నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు.

బుధవారం ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ)లో ‘కోవిడ్-19 ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా చినవీరభద్రుడు  మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి సోకకుండా, వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమవంతు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు తప్పక ధరించాలన్నారు.

అనంతరం సిబ్బందితో కోవిడ్-19 ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.