1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (20:49 IST)

ఆంధ్రప్రదేశ్ ‘సీఎం రిలీఫ్ ఫండ్’కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 5 కోట్ల సాయం

అమరావతి: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి(సిఎంఆర్‌ఎఫ్) రూ .5 కోట్లు తనవంతు సాయంగా విరాళమిచ్చింది.
 
కోవిడ్ -19కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపుపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతో పాటు PM-CARES సహాయ నిధికి రిలయన్స్ ఇప్పటికే రూ. ​​530 కోట్లకు పైగా అందించింది.
 
కరోనా వైరస్ మహమ్మారి విసురుతున్న సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడి గెలిచేందుకు రిలయన్స్ తనవంతు కృషి చేస్తోంది. ఇందుకుగాను ఈ అసాధారణ పరిస్థితిలో ప్రజలకు ఆహారం, సరఫరా, సురక్షితంగా వుండేందుకు RIL తన 24x7, బహుళ-వైపు, ఆన్-ది-గ్రౌండ్ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ కరోనా వైరస్‌ను పారదోలే ప్రయత్నంలో ముందున్నాయి. ఈ క్రమంలో భారతదేశపు మొదటి 100 పడకల ప్రత్యేకమైన కోవిడ్ -19 హాస్పిటల్‌తో సహా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రిని కోవిడ్ -19 రోగులను నిర్వహించడానికి కేవలం రెండు వారాల్లోనే సిద్ధం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉచిత భోజనం అందించేందుకు రంగంలోకి దిగింది.
 
ఆరోగ్య కార్యకర్తలు మరియు సంరక్షకుల కోసం రోజూ లక్ష మాస్కులను ఉత్పత్తి చేయడం, ఆరోగ్య కార్యకర్తలు మరియు సంరక్షకుల కోసం రోజూ వేలాది పిపిఇలను తయారు చేయడం, దేశవ్యాప్తంగా ఉచిత ఇంధనంతో పాటు నోటిఫైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు ఈ కార్యక్రమాలు చేస్తోంది. రిలయన్స్ రిటైల్ ప్రతిరోజూ మిలియన్ల మంది భారతీయులకు దుకాణాలు మరియు ఇంటి డెలివరీల ద్వారా అవసరమైన సామాగ్రిని అందిస్తోంది.