1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 జూన్ 2025 (16:07 IST)

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

actor sivaji
కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుందని నటుడు శివాజీ అన్నారు. ఆయన ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
 
తిరుమల శ్రీవారు కళకళలాడుతున్నారు. గతంలో కాస్త తేడాగా అనిపించారు. ఐతే ఇప్పుడు ఆయన ముఖం కళకళలాడుతోంది. ప్రజలు సుఖసంతోషాలతో వున్నారు. పోలవరం, అమరావతి రాజధాని పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖసంతోషాలతో వుంటారు. అంతా శుభమే జరుగుతుంది.
 
తెలుగుదేశం, జనసేన, భాజపా ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల అభీష్టాలను తెలుసుకుని ముందుకు సాగుతోందని అన్నారు. ఎవరూ ఏమీ భయపడాల్సిన అవసరంలేదన్నారు.