1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (15:48 IST)

హాట్ హాట్‌గా ఏపీ రాజకీయాలు- ఆదాల క్లారిటీ..

adala prabhakar reddy
ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. వైసీపీని కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. టికెట్ ఆశించని వారు కూడా ఈ కోవలో ఉండటం రాజకీయంగా సంచలనంగా మారింది. టికెట్‌పై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముందుగానే పార్టీ వీడుతున్నారు. 
 
కానీ నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీ వీడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. 
 
వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మరో 20 ఏళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. 
 
నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై కూడా పార్టీ వీడతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీని వీడటం లేదని చెప్పుకొచ్చారు.