గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (14:37 IST)

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే లేచి కూర్చొన్న మహిళ

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే సంఘటన ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఓ మహిళ అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమె కన్నుమూసిందని భావించిన.. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మరికొన్ని క్షణాల్లో అంత్యక్రియలు పూర్తిచేయాల్సివుండగా ఆ మహిళ అందరికీ షాకిస్తూ ఉన్నట్టుండి లేచి కూర్చొంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. అంత్యక్రియలకు హాజరైనవారంతా వచ్చి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగపూర్ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళ కొన్నేళ్ల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుండేది. దీంతో ఆమెకు అత్యవసర చికిత్స అందించడం కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 
 
ఇక చేసేది ఏమి లేక కుటుంబసభ్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆమె లేచి కూర్చుంది. దీనికి ఆమె కుటుంబసభ్యులు ఒకింత షాక్‌కు గురయ్యారు. కాగా మెరుగైన చికిత్స కోసం ఆమెను జగిత్యాలలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.