1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (21:13 IST)

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు 400 రోజులు.. 28న బంద్

ఈ నెల 28వ విశాఖ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్య‌క్షుడు అయోధ్య‌రామ్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు అన్ని పార్టీలు ఒక్క‌తాటిపైకి రావాల‌ని పిలుపునిచ్చారు. 
 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షకు రేపటికి 400 రోజులు పూర్తి కావస్తుందని వివరించారు. కేంద్రం రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కొనసాగిస్తామనే వరకు పోరాటం చేస్తామని అన్నారు.
 
ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలని చూస్తే బీజేపీ దీపం ఆరిపోవడం ఖాయమన్నారు అయోధ్య రామ్ తెలిపారు. 
 
స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం వందమంది ఎంపీ సంతకాలతో ఢిల్లీ వెళ్లి పోరాడతామని చెప్పారు. ప్రస్తుతం ఒక్క ఏడాదికి రూ. 5వేల కోట్లు పన్నులు ప్లాంట్‌కు చెల్లిస్తున్నామని నాయకులు వెల్ల‌డించారు.