గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 4 ఆగస్టు 2018 (19:55 IST)

మేం నలుగురమూ నిన్ను గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తాం... మహిళా రిపోర్టరుపై దాడి

రోజురోజుకు జర్నలిస్ట్ లపై పెరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయి. మహిళా జర్నలిస్ట్‌లకు రక్షణ కరువయిందనడానకి తాజాగా జరిగిన ఘటన నిదర్శనం. గుంటూరు జిల్లాకు చెందిన బొమ్మిశెట్టి ఉమాదేవి టీవీ 4 న్యూస్ చానల్లో పనిచేస్తున్నారు. ఆ ఓ కేసు వ్యవహారంపై పోలీసు స్టేషన

రోజురోజుకు జర్నలిస్ట్ లపై పెరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయి. మహిళా జర్నలిస్ట్‌లకు రక్షణ కరువయిందనడానకి తాజాగా జరిగిన ఘటన నిదర్శనం. గుంటూరు జిల్లాకు చెందిన బొమ్మిశెట్టి ఉమాదేవి టీవీ 4 న్యూస్ చానల్లో పనిచేస్తున్నారు. ఆ ఓ కేసు వ్యవహారంపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో తనపై దాడి చేశారు.
 
ఆమె మాటల్లోనే... ''నాపై దాడి జరిగిందని పోలీసులకు విషయం చెప్పి 15 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగితే, ముద్దాయికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. శుక్రవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో మా ఇంటి లోపలికి నలుగురు ముద్దాయిలు ప్రవేశించి ఇక్కడే మేం నలుగురమూ నిన్ను రేప్ చేస్తాము... చంపేస్తాం అంటూ చెప్పుకోలేని బూతులు తిడుతూ, నా కంఠంపై కత్తితో కోసి నన్ను బలవంతం చేస్తూ చిత్రహింసలు పెట్టారు.
 
కేసు వాపసు తీసుకోకపోతే సామూహిక అత్యాచారం చేసి చంపుతాము అని బెదిరించి, మా ఆటో పగలగొట్టి బీభత్సం చేశారు. నాకు వారితో ప్రాణభయం ఉంది. నన్నేమి చేస్తారో అని భయంగా ఉంది. దయచేసి నాకు అండగా నిలబడాలని జర్నలిస్ట్ సోదరులకు మనవి చేసుకుంటున్నాను'' అంటూ బొమ్మిశెట్టి ఉమాదేవి కన్నీటి పర్యంతమవుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.