1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (08:57 IST)

పోలీసులంటే అంత చులకనా... చొక్కా విప్పి కొడతారా: మహిళా ఏఎస్ఐ ఆవేదన

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు తాను మంత్రినన్న విచక్షణను మరిచిపోయి విధుల్లో ఉన్న సీఐని దుర్భాషలాడారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విధుల్లో ఉన్న తమ అధికారిని ప్రజాప్రతినిధి దుర్భాషలాడటంపై విశాఖకు చెందిన ఓ మహిళా ఏఎస్ఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో ఓ ఆడియోను పోస్ట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"సార్ నమస్తే అంటూ ఆమె తన ఆవేదనను ప్రారంభించారు. పోలీసులంటే అందరికీ లోకువేనా సర్ అని ప్రశ్నిచారు. మీతో మాట్లాడాలన్నా తనకు ఏడుపు వస్తుందన్నారు. ప్రతిసారి పోలీసులను బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. సీఎం ప్రోటోకాల్ ఎంతో కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మా విధులు మేం నిర్వహించడం కూడా తప్పేనా? అని నిలదీశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడటం కరెక్టేనా?" అని ప్రశ్నించారు. 
 
మీ బందోబస్తు కోసం ఉదయం నుంచే రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. పై అధికారుల అదేశాలను పాటించడం కూడూ తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత రాజకీయ నాయకుడు అయితే మాత్రం పోలీసు ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.