సంబంధిత వార్తలు
- మేకవన్నె పులి.. నేనూ గిరిజనుడ్నే అంటూ ఇంట్లోకి పిలిచి...
- లైంగిక దాడి జరిగిందని చెప్పినా వినలేదు.. చెవి కొరికి చేత బట్టుకుని...
- యూపీలో ఘోరం.. భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి?
- మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి యువతిపై రేప్ చేసిన దొంగ బాబా
- 32 ఏళ్లు నన్ను వాడుకున్నాడు... భాజపా అభ్యర్థి ఫోటోలు వైరల్
వర్షం పడుతుందని ఇంట్లోకి రమ్మన్నాడు.. వచ్చాక కరెంట్ కట్ చేసి.. అత్యాచారం చేశాడు..
మహిళలపై దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయి. మహిళలు ఒంటరిగా వెళ్ళినా.. చివరికి భర్తతో వెళ్ళినా.. అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా వర్షం పడుతుంది. ఓ ఇంటి బయట నిలిచిన మహిళను లోపలికి పిలిచి మరీ
మహిళలపై దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయి. మహిళలు ఒంటరిగా వెళ్ళినా.. చివరికి భర్తతో వెళ్ళినా.. అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా వర్షం పడుతుంది. ఓ ఇంటి బయట నిలిచిన మహిళను లోపలికి పిలిచి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లాకు చెందిన మహిళ (48) రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో నివాసం ఉండే తన కుమారుల వద్దకు వచ్చింది. మధ్యలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగివస్తుండగా.. వర్షం జోరుగా కురిసింది. దీంతో వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక ఇంటి ముందు నిల్చుంది.
ఆమె నిల్చున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రాజు నాయక్ (23) అనే యువకుడు ఆమెను గిరిజన మహిళగా గుర్తించి.. ఇంట్లో వచ్చి కూర్చోమన్నాడు. ముందుగా కాస్త జంకిన మహిళ.. ఆపై గిరిజనులకు తెలిసిన భాషతో ఆమెను నమ్మించాడు.
వర్షం తగ్గేవరకూ ఇంట్లో కూర్చుని వెళ్లిపోవచ్చని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. సొంత భాషలో మాట్లాడడంతో ఆమె కూడా నమ్మి ఇంట్లోకి వెళ్లింది. కాసేపటి తరువాత తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపేసిన ఆ యువకుడు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అరెస్టు చేశారు.
తర్వాతి కథనం
