YS Sharmila: ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం.. జూన్ 9 నుంచి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, పార్టీ గత వైభవాన్ని పునరుద్ధరించడం.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ కేడర్ను శక్తివంతం చేయడం, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడం అనే లక్ష్యాలతో ఆమె ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్ర స్థాయి పర్యటన జూన్ 9న చిత్తూరు జిల్లాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వైఎస్. షర్మిల రాష్ట్రంలోని ప్రతి జిల్లాను సందర్శిస్తారు. ఈ పర్యటన జూన్ 30న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగుస్తుంది.
అక్కడ ముగింపు బహిరంగ సభ జరుగుతుంది. దీనికి పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారు. ఈ 22 రోజుల ప్రయాణంలో ప్రతి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. ఈ సంస్థాగత సమావేశాలతో పాటు.. ప్రజలతో మమేకం అవడమే ఈ పర్యటన లక్ష్యం.
ఈ పర్యటన వైఎస్ షర్మిల గతంలో నిర్వహించిన ప్రజా ప్రస్థానం యాత్రకు కొనసాగింపు అని, రాష్ట్రంలో పార్టీ పునరుజ్జీవనానికి ఇది గణనీయంగా దోహదపడుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.