1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (16:27 IST)

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ

ఏపీలో వైసీపీ ఆగ‌డాలు మితిమీరిపోయాయ‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమ‌ర్శించారు. వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ఆమె కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చారుని గుర్తు చేశారు.
 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబు అని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత అని కొనియాడారు. లోటు బడ్జెట్లో కూడా ఏపీలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు? తడిగుడ్డలతో గొంతుకోయడం సజ్జలకు బాగా తెలుసు అని, ఇక వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశారు అని పంచుమ‌ర్తి అనూరాధ విమ‌ర్శించారు. రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పండి అంటూ, వైసీపీ నేత‌ల‌ను, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆమె స‌వాలు చేశారు.