సంబంధిత వార్తలు
- పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు వేస్తారు.. వారి పాపానికి వారే బాధ్యులు.. సీఎం జగన్
- రాజమౌళి చిత్రంలో డ్రీమ్ గర్ల్గా నటించాలనుంది: వైల్డ్ డాగ్ బ్యూటీ సయామి
- వేసవి కాలంలో మామిడిపండ్లు తింటే సెగ్గడ్డలు వస్తాయా?
- ప్రతిరోజూ బాదములను తింటే ముఖంపై ముడతలు పోతాయి, కాంతివంతమైన చర్మం
- మహిళలు బరువు తగ్గాలంటే.. ఇంటి పని చేస్తే సరిపోదు.. ఇది కూడా..?
అందంగా వుండాలంటే ఇవన్నీ చేయాలి
అందంగా వుండాలంటే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సీజనల్గా దొరికే పండ్లతో పాటు చర్మ లక్షణాలను బట్టి ఆహారం తీసుకుంటూ వుండాలి. ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు. తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్ధన చేసుకోవాలి. కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది.
టీ స్పూన్ కీరా జ్యూస్లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి.
ఎక్కువసార్లు మంచినీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
