బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టి....

Written By సిహెచ్
Updated: గురువారం, 4 జులై 2019 (20:32 IST)
సాధారణంగా మన చర్మం రంగు ఎరుపా, చామనఛాయ అన్న విషయంతో సంబంధం లేకుండా అది ప్రకాశవంతంగా మెరుస్తుంటే చూసేకొద్దీ చూడాలని అనిపిస్తుంటుంది. అందుకే మనం చంర్మం మెరుపుని సంతరించుకోవడానికి అనేక రకములైన కాస్మోటిక్స్ వాడుతుంటాము. అలా చేయడం వలన సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా సహజసిద్దంగా లభించే పదార్దాలతో కొన్ని చిట్కాల ద్వారా మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. తరువాత రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం తేమని సంతరించుకుని అందంగా మెరుస్తుంటుంది.
 
2. ముఖాన్ని శుభ్రంగా కడిగి తేనె, ముల్తానా మట్టి కలిపిన మిశ్రమాన్ని పట్టించి పావుగంట తరువాత కొద్దిగా నీళ్లు తీసుకుని మెల్లగా మర్దనా చేస్తూ రుద్ది కడిగేయాలి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమంగా చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.
 
3. కొవ్వు తక్కువగా ఉన్న పాలను తీసుకుని వాటిని ముఖానికి పలుచని పూతలా వేసి చర్మంలో కలిసిపోయేలా మృదువుగా మర్దనా చేయాలి. పది నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి ముఖం మృదువుగా ఉండి మెరుస్తుంటుంది.

అన్నీ చూడండి

ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ మహిళా ఎంపీ మద్దతు - కుమార్తె మాత్రం కాక్రోచ్ పార్టీకి సపోర్టు

వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్

ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య

గొడ్డలి పార్టీ నేతలతో వేదికను పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు

పాకిస్థాన్ చొరబాటు మార్గాలను వెతుకుతోంది : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments