శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (11:05 IST)

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. జీతాలను ప్రతీయేటా పెంచుతారట..

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. జీతాలను ప్రతి సంవత్సరం పెంచేదిశగా ఐబీఏ రంగం సిద్ధం చేస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ)తో పాటు  యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) కలిసి బ్యాంకు ఉద్యోగులకు ప్రతీ ఏటా 15 శాతం జీతాల పెంపు కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక ప్రధాన బ్యాంక్ యూనియన్ నాయకుడు మీడియాకు తెలిపారు. 
 
ఐబిఎ, కార్మికులు, అధికారుల సంఘాల మధ్య అవగాహన ఒప్పందం ప్రకారం, దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే వేతన సవరణ నవంబర్ 1, 2017 నుండి అమలులోకి వస్తుంది.
 
ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 15 శాతం జీతం ప్రతీ ఏటా పెంచుతారు. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులతో సహా 37 బ్యాంకులు తమ ఉద్యోగులకు వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఐబిఎ ఆదేశాలు ఇచ్చింది.