సంబంధిత వార్తలు
- గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూ యాప్లో గుజరాతీ భాష అధికారికంగా ప్రారంభించారు
- కూ యాప్తో జతకట్టిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్
- కూ యాప్ హాటెస్ట్ ఎమర్జింగ్ డిజిటల్ బ్రాండ్, ఎక్కడో తెలుసా?
- Koo (కూ) యాప్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
- మెంటల్ యాంగ్జైటీతో కరోనా మరణాలు : భాగ్యశ్రీ
యూజర్లు ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండటానికి అవగాహన కల్పిస్తున్న కూ యాప్
మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారం కూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా నిర్వహించడంపై యూజర్లకు అవగాహన కల్పిస్తోంది. కూ యాప్ లోని యూజర్లు, స్థానిక భాషలలో వ్యక్తీకరణను ప్రారంభించేవారు, సోషల్ మీడియాకు మొదటిసారి వచ్చినవారు ఆన్లైన్లో జాగ్రత్తగా, సానుకూలంగా ఉండాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది.
సోషల్ మీడియా ప్రజలను కనెక్ట్ చేయడానికి, నిమగ్నం చేయడానికి కీలకమైన సాధనం అయినప్పటికీ, ఆర్థిక మోసం, గోప్యతపై దాడి, డేటా చోరీ ఇతర నేరాల కోసం సామాజిక వ్యతిరేక అంశాలు దుర్వినియోగం చేయవచ్చు. ప్రపంచం కోసం భారత్ నుండి నిర్మించబడుతున్న ఓపెన్ సోషల్ మీడియా బ్రాండ్గా, కూ యాప్ యూజర్లకు సమాచారం అందించడానికి అనేక దశలను తీసుకుంటోంది. దీని ద్వారా వారు ఏదైనా కంటెంట్ను పోస్ట్ చేసే ముందు అప్రమత్తంగా ఉంటారు, కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడానికి అలాగే వారి ఫీడ్ని ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించడానికి ప్లాట్ఫారంను ఉపయోగించుకోవచ్చు.
ఇటీవల, కూ యాప్ జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ నెల అయిన అక్టోబర్ లో సైబర్ భద్రత పై అవగాహన కల్పించడానికి పౌరుల అవుట్ రీచ్ కార్యకలాపాలను సంయుక్తంగా అమలు చేయడానికి భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్తో కలిసి పనిచేసింది. CERT-In మరియు కూ యాప్ హ్యాకింగ్, చోరీ, వ్యక్తిగత సమాచార భద్రత, పాస్వర్డ్- పిన్ నిర్వహణ, క్లిక్ బైట్లను నివారించడం మరియు పబ్లిక్ వై-ఫైని ఉపయోగిస్తున్నప్పుడు ఒకరి గోప్యతను రక్షించడం వంటి కీలక సమస్యల పై అవగాహన పెంచడానికి పనిచేశాయి. కూ యాప్ దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ యూజర్ల మధ్య చేరువను మరింత బలోపేతం చేయడానికి అనేక భారతీయ భాషలలో క్యాంపెయిన్ అమలు చేసింది.
అంతేకాకుండా, యూజర్లకు అవగాహన కల్పించడానికి కొనసాగుతున్న చొరవలో భాగంగా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ క్రౌడ్-సోర్సింగ్ కంటెంట్ మోడరేషన్ కోసం పని చేస్తోంది. ఇక్కడ నకిలీ కంటెంట్ను ఫ్లాగ్ చేసినందుకు యూజర్లకు రివార్డ్ ఇవ్వబడుతుంది. అలాగే, కంటెంట్ని వెరిఫై చేయఉండా 'నకిలీ' అని లేబుల్ చేసినందుకు వారికి జరిమానా విధించబడుతుంది.
భారత్ యొక్క మొదటి ప్లాట్ఫామ్లో సమాచారాన్ని పంచుకునే ముందు వారు ఉపయోగించగల ఉచిత వనరులను ఆన్లైన్ లో యూజర్లకు తెలియజేస్తోంది. కూ యాప్ తన కంటెంట్ మోడరేషన్ విధానాలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గనిర్దేశం చేసేందుకు సలహా బోర్డును ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఒక బాధ్యతాయుతమైన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్గా, కూ యాప్ ఉత్తమ అభ్యాసాలను గుర్తించడానికి మరియు యూజర్లకు భాషల్లో సురక్షితమైన మరియు లీనమయ్యే నెట్వర్కింగ్ అనుభవాన్ని అందించే స్థానికంగా పని చేయగల పరిష్కారాలను తీసుకురావడానికి నిరంతర ప్రాతిపదికన ప్రయత్నిస్తుంది.
