మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (08:50 IST)

నేడు డీఎస్సీ-2008 క్వాలిఫై అభ్యర్థులకు కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2008లో నిర్వహించిన డీఎస్సీ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి. 
 
డీఎస్సీ-2008కి సంబంధించి నియామక ప్రక్రియ మార్పు కారణంగా నిలిచిపోయిన 2,193 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ)లను మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌(ఎంటీఎస్‌)తో కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరి నియామక ఉత్తర్వులు జారీచేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ శుక్రవారం జారీ చేశారు. జిల్లాల డీఈవోలు ఈ నెల 10న అర్హత కలిగిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. 
 
విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాలు ఇలా వున్నాయి.. 
 
* బదిలీ జరిగినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు అందుబాటులో లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించాలి.
 
* విద్యార్థులు ఉండి, ఉపాధ్యాయులు లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించవచ్చు. 
 
* 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండి, బ్లాక్‌ చేయని 3, 4 కేటగిరీలలోని ఖాళీలను వీరితో భర్తీ చేయవచ్చు. 
 
* నియమించవలసిన ఉపాధ్యాయులకు ఖాళీలు సరిపోకుంటే కేటగిరీ-4లోని ఖాళీలను భర్తీ చేయాలి. 
 
* అయినప్పటికీ పోస్టులు చాలకపోతే.. కేటగిరీ-3లో బ్లాక్‌ చేసిన ఖాళీలలో భర్తీ చేయవచ్చు.