ఎన్.ఐ.టి వరంగల్‌లో 3 వేల లోపు ర్యాంకులకే కంప్యూటర్‌ సైన్స్‌ సీటు

గురువారం, 11 ఆగస్టు 2022 (12:34 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌)లో సీటు పొందడానికి జనరల్‌ కేటగిరీ బాలురు (తెలంగాణ) 3,089 లోపు ర్యాంకు సాధించాల్సి ఉంటుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాలికలకు 3,773 లోపు జాతీయ ర్యాంకు తప్పనిసరి. గత విద్యాసంవత్సరం(2021) జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కటాఫ్‌ ర్యాంకులను బట్టి ఇది స్పష్టమవుతోంది. 
 
ఈ సారి పోటీని బట్టి కొద్దిగా అటుఇటుగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడైన విషయం తెలిసిందే. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లను ఆ ఎన్‌ఐటీ ఉన్న రాష్ట్రం(హోం స్టేట్‌)లోని విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తారు. ఈ లెక్కన ఎన్‌ఐటీ వరంగల్‌లోని సగం సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇస్తారు. మిగిలిన సీట్లకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు పోటీపడొచ్చు.
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఐటీ ఏర్పాటైనందున ఆ రాష్ట్ర విద్యార్థులకు ఇప్పుడు వరంగల్‌లో ‘హోం స్టేట్‌ కోటా’ లేదు. ఓపెన్‌ కోటా విద్యార్థులకు 55 వేల ర్యాంకు వచ్చినా ఎన్‌ఐటీ వరంగల్‌లో సీటు(ఏ కోర్సులోనైనా..) వస్తుంది. ఉదాహరణకు.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌ ఫిజిక్స్‌లో 55,819 ర్యాంకుకు ఓపెన్‌ కేటగిరీలో సీటు దక్కుతుంది. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో 24 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments