నీట్ ప్రవేశ పరీక్ష ద్వారానే మెడికల్ అడ్మిషన్లు.. సుప్రీంకోర్టు
నీట్ ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పును గురువారం వెలువరించింది. మెడికల్ ప్రవేశ పరీక్షను నీట్ ద్వారానే నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఈ పరీక్షను రెండు విడతలుగా నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది.
మెడికల్ ప్రవేశ పరీక్ష, సీబీఎస్ఈ షెడ్యూల్ ప్రకారం మే 1న తొలిదశ పరీక్ష నిర్వహించేందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. జులై 24న రెండో దశ పరీక్ష నిర్వహించాలని సుప్రీం అనుమతిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అమలుచేయాలని ఆదేశించింది. ఆగస్టు 17న రెండు దశల ఫలితాలు విడుదల చేయాలని, సెప్టెంబరు 30లోగా ఆడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది.