తెలంగాణ, కర్ణాటక హై రిస్క్ రాష్ట్రాలు: ఏపీ సర్కారు

సోమవారం, 13 జులై 2020 (22:29 IST)
తెలంగాణ, కర్ణాటకను సహా హైరిస్క్ రాష్ట్రాలుగా ఏపీలోని వైకాపా సర్కారు పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, కర్ణాటకల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఏపీకి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న నేపథ్యంలో హై రిస్క్ ప్రాంతాలుగా మార్పులు చేయడం జరిగిందని జవహర్ రెడ్డి తెలిపారు. ఫలితంగా విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు ఖచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనన్నారు.

విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలి. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేసి, 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని జవహర్ ప్రకటించారు.

అన్నీ చూడండి

director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?

Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్

రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్

శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మిస్టర్ మిడిల్ క్లాస్

Nikhil: రోషన్ కనకాల హీరోగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments